నవతెలంగాణ-పెద్దవూర : శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ జయంతి సందర్బంగా సాగర్ నియోజకవర్గం ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న శుభాకాంక్షలు తెలిపారు.మహాకవి శ్రీశ్రీ జయంతి కలమును బట్టి ప్రాణంబోసి కలమును కదిలించిన అక్షరజ్యోతి ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని రంగనేలినట్టి విప్లవకవి కవి బ్రహ్మ స్వరూపుడు భారతదేశ ప్రజానీకానికి శ్రీశ్రీ తెలుగు వీరలెవరాయని మన్యందొర స్వాతంత్ర పోరాటాన్ని చాటిచెప్పే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ యావత్ యువలోకాని మేల్కొపిన మహోన్నత వ్యక్తి శ్రీశ్రీ అని సందర్బంగా కొనియాడారు.