- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దర్శకుడు సి.సుందర్ తొలిసారి తమిళనాడు ఎన్నికల బరిలోకి అడుగుపెట్టారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎన్కే పార్టీ తరఫున సుందర్ నిలబడ్డారు. ఈ మేరకు పీఎన్కే వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం శనివారం వెల్లడించారు. పీఎన్కే అభ్యర్థి అయినప్పటికీ.. సుందర్ అన్నాడీఎంకే గుర్తు మీదే పోటీ చేయనున్నారని షణ్ముగం తెలిపారు.
- Advertisement -



