- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక స్టార్టప్ కంపెనీ మద్యం సేవించి ఇంటికి వెళ్లలేని వారికి డ్రైవర్ సేవలను ప్రారంభించింది. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా డ్రైవర్ను బుక్ చేసుకోవచ్చు. డ్రైవర్ 30-40 నిమిషాల్లో వచ్చి, బుక్ చేసుకున్న వారిని వారి సొంత కారులోనే ఇంటికి క్షేమంగా చేరుస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానాలను నివారించడానికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో డ్రంక్ అండ్ డ్రైవ్కు రూ.10,000 జరిమానా ఉంది. ఈ డ్రైవర్ సేవలకు గంటకు రూ.200, రెండు గంటలకు రూ.300, నాలుగు గంటలకు రూ.400 వసూలు చేస్తున్నారు.
- Advertisement -



