- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. దీంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 81,345 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 24,727 వద్ద ఉన్నాయి.
- Advertisement -