- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ల మధ్య భగ్గుమంటోన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల నడుమ.. తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 80,755 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకొని 24,422 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 84.66 వద్ద ఉంది.
- Advertisement -