Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకంపై కఠిన చర్యలు తప్పవు 

నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకంపై కఠిన చర్యలు తప్పవు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వాహనాలకు నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్లపై నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఆర్ ఐ వినోద్ , ఆర్ఎస్ఐ సుమన్ సిబ్బంది  తనిఖీల్లో భాగంగా కారు డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న కార్లను గుర్తించి వాటిపై చట్టరీత్యా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మోటారు వాహనాల చట్టం ఆర్టిఏ నిబంధనల ప్రకారం కార్ల డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరం. ఇది ప్రజల భద్రతకు హానికరం. బ్లాక్ ఫిల్మ్ వలన వాహనాలలో కూర్చున్నవారిని వెలుపల నుండి చూడలేకపోవడం వల్ల అనేక నేరాలు జరగుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ ఈ నిషేధాన్ని గౌరవించాలి. ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వాడితే వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలకు బ్లాక్ ఫిల్మ్ ను వాహనాలపై వాడకండి అని, ట్రాఫిక్ నియమాలను గౌరవించండి అని , భద్రత మీ చేతుల్లో ఉందని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -