నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో గాలివానాలు బీభత్సం సృష్టించాయి.శనివారం రాత్రి సమయంలో బలమైన గాలులు దేశరాజధానిలో పలు ప్రాంతాల్లో వీచాయి. ఈ తీవ్రమైన దుమ్ముధూళితో కూడిన ఈదురు గాలులకు స్థానికంగా ఉండే సఫ్దర్జంగ్ ఎన్ క్లేవ్ అనే ప్రాంతంలో సెల్ టవర్ కూలిపోయింది. దీంతో ఆ సమయంలో అటువైపు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు సెల్ టవర్ క్రేన్ సాయంతో తొలగించారు. ఇటీవల వేడిగాలుల నుండి ఆదివారం ఢిల్లీకి ఉపశమనం లభించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి, దీనితో ఉష్ణోగ్రతలు తగ్గాయి, గాలి నాణ్యత మెరుగుపడింది. ఈక్రమంలో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు, గంటకు 80-100 కి.మీ వేగంతో బలమైన గాలులు తెల్లవారుజామున రాజధాని అంతటా వీచనున్నయని పేర్కొంది. ఢిల్లీవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఢిల్లీలో ఈదురు గాలుల బీభత్సం.. కూలిన సెల్ టవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES