- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుంతకల్లు మండలానికి చెందిన నాగభూషణం కుమారుడు వడ్డే శ్రీనివాసులు ఇటీవల పదవ తరగతి అయిపోవడంతో ఇంటర్ చదివేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రిని అడగ్గా.. కొన్ని రోజులు ఆగమని తన తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -