- Advertisement -
– బస్సులు ఆపడం లేదని ఆందోళన
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
బస్సులు ఆపడం లేదని మంగళవారం జోగులంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో పర్దిపురం స్టేజిలో బస్సులు ఆపడం లేదని, పాఠశాల సమయంలో ప్రత్యేకమైన ఒక బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. ప్రస్తుతం వస్తున్న బస్సులు కూడా సమయపాలన పాటించడం లేదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహించి రోడ్డుపై నిరసన తెలిపారు.
- Advertisement -

                                    

