నవతెలంగాణ-కామారెడ్డి: ఆదివారం ప్రకటించిన ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో శ్రీ ఆర్యభట్ట, కోటిల్య కళాశాలల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎల్. వైష్ణవి 468/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. అలాగే ఎం.రోహణ లక్షల, ఆర్.నిజాంత్, వి.మహేష్ ప్రభథను MPC విభాగంలో 467/470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎం. ఉషస్ (991/1000), పి. సాహిత్య (991/1000) అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా, బైపీసీ విభాగంలో ఎం. సాయి వర్ష 434/440 మార్కులతో ప్రతిభ చాటుకుంది. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించడం ఆనందకరమని తెలిపారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యభట్ట కళాశాల ప్రిన్సిపల్ హనంతరావ్, కోటిల్య కళాశాల ప్రిన్సిపల్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు రవి, స్వామి, కృష్ణ ప్రసాద్, సైదయ్య, కపిల్, శ్రీనివాస్, సిద్దారాములు, వెంకటేష్, సురేష్ రెడ్డి, చందు, సత్యనారాయణ, అనిల్, చంద్ర, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



