- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో మెనూ ప్రకారం భోజనం అందించేలా చూడాలని కుభీర్ ఆశ్రమ పాఠశాలను బుధవారం మండల విద్యాధికారి విజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సూచించారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేల చూడాలన్నారు. ఆయన వెంట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం తిరుమల ఉన్నారు.
- Advertisement -



