- Advertisement -
మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు 2025-26 విద్య సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ బడులకు 50 శాతం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పాఠశాలలో గేమ్స్ ఆడించినట్లుగా తెలిపారు. క్రీడలతో విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తామన్నారు. గేమ్స్ పిటి పక్కల రాజబాబు ఆధ్వర్యంలో కోకో,కబడ్డీ తదితర ఆటలు నిర్వహించారు.
- Advertisement -



