- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన పీసర అరుణ ,సాయినాథ్ గౌడ్ దంపతుల కూతురు పీసర గీతిక ఇంటర్మీడియెట్ లో ఆదివారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో రాష్ట స్థాయిలో మంచి మార్కులు సాధించారు. ఇంటర్ ఎంపిసి విభాగంలో మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. దీంతో విద్యార్థిని గ్రామ సర్పంచ్ దొడ్డి కింది సర్వేష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు పేడరేషన్ రాష్ట నాయకులు పీసర మహేందర్ గౌడ్, గ్రామస్తులు సత్యనారాయణ, రవి, విశ్వనాథ్ఘ, పాండులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.
- Advertisement -



