- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; అంతరిక్షం నుంచి వ్యోమగామి శుభాంశు శుక్లా తొలి సందేశం పంపారు. దేశ ప్రజలకు అంతరిక్షం నుంచి నమస్కారం తెలిపారు. రోదసీలో ఎలా నడవాలి, ఎలా తినాలనేది శిశువులా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశ అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన, దృఢమైన అడుగు అని పేర్కొన్నారు. ఐఎస్ఎస్లో సమయం గడపడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అక్కడి అనుభవాలను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు శుభాంశు శుక్లా వివరించారు.
- Advertisement -