Friday, June 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న ఈ రోదసి యాత్ర ఉంటుందని ఇటీవల ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు రోదసియాత్ర చేపట్టనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సిఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -