నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా తన దగ్గరికి వచ్చి తమ సమస్యను వివరిస్తే సమస్య పరిష్కారానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తన మానవత్వాన్ని చాటుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత సుభాష్ రెడ్డి. వారు వృత్తి రీత్యా… సిందోళ్ళు…సిందట కళాకారులు కామారెడ్డి జిల్లాలోని బిబిపేట మండలం, జనగామ గ్రామానికి వచ్చి గ్రామంలో తమ కలను ప్రదర్శిస్తున్న సమయంలో గ్రామస్తుల ద్వారా సుబాష్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకుని వారు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి కళాకు సంబంధించిన సామగ్రి కొరకు ఆర్థిక సహాయం అడిగి సాధక బాధకలు తెలుపగా వెంటనే సుభాష్ రెడ్డి స్పందించి ఎస్సార్ ఫౌండేషన్ ద్వారా 11000 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు బోదాస్ సాయికుమార్, చాట్ల బాబు, కిషన్ రావు, సింధు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
సిందాట కళాకారులకు ఆర్థిక సాయం అందించిన సుభాష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES