తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే జీ5 ఇప్పుడు ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ సిరీస్తో అలరిస్తోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్కు పోలూరు కష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై కె.వి.శ్రీరామ్ ఈ సిరీస్ను నిర్మించారు. ఈ సిరీస్ ఈనెల 27 నుంచి జీ5లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం టీం నిర్వహించిన సక్సెస్మీట్లో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ, ‘ఈ సిరీస్పై నెగెటివిటీ ఉన్నా కూడా ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్తో వస్తూనే ఉంటాం. మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’ అని అన్నారు. ”రెక్కీ’తో మేం సక్సెస్ సాధించాం. ‘రెక్కీ’ తరువాత ఎన్నో కథలు వింటే ‘విరాటపాలెం’ పాయింట్ నన్ను హంట్ చేసింది. ‘రెక్కీ’ చాలా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని ప్రమోషన్స్లో చెప్పాం. ఇప్పుడే అదే జరుగుతోంది. ‘విరాటపాలెం’ను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంంక్స్. మేం ఇక్కడ ఎవ్వరి గురించి మాట్లాడటానికి రాలేదు. మా మాటల కంటే మా విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’ అని నిర్మాత శ్రీరామ్ అన్నారు. జీ5 తెలుగు వైస్ ప్రెసిడెంట్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ .. ”పులి మేక’, ‘బహిష్కరణ’, ‘పరువు’ ఇప్పుడు ‘విరాటపాలెం’. ఇలాంటి కొత్త కంటెంట్లను మేం మాత్రమే క్రియేట్ చేయగలం. ‘విరాటపాలెం’ ఒక్క రోజులోనే ‘రెక్కీ’ కంటే డబుల్ వ్యూస్ను సాధించింది’ అని తెలిపారు.