బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. ఈ చిత్ర టీజర్ను హీరో సుధీర్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ‘దర్శకుడు బాబ్జీ మా మావయ్య సూపర్ స్టార్ కష్ణకి బాగా దగ్గరివారు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణ ఫ్యాన్స్కి సుపరిచితుడు. అటువంటి బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. టీజర్ అంటే రకరకాల వ్యాపకాలతో, రకరకాల మూడ్స్తో ఉండే ప్రేక్షకులను చిటిక వేసి మనవైపుకు తిప్పుకునే అస్త్రం. ‘పోలీస్ వారి హెచ్చరిక’ అలా ఒక అస్త్రంలా ఆకర్షణీయంగా, రిచ్గా ఉంది’ అని అన్నారు.
‘నేను ఏ సినిమా చేసినా ఆ సినిమా తాలూకు ఏదో ఒక కార్యక్రమాన్ని కష్ణ చేతుల మీదుగా జరుపుకునే వాడిని. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా జరుపుకోలేక పోయాననే లోటును సుధీర్ బాబు రూపంలో జరగటం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు బాబ్జీ చెప్పారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ, ‘నాలాంటి కొత్త నిర్మాత తీసిన ఇటువంటి చిత్రానికి సంబంధించి ప్రముఖులందరూ ప్రమోషన్ చేస్తూ సపోర్ట్ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని తెలిపారు.
అలాంటి అస్త్రమే.. ‘పోలీసు వారి హెచ్చరిక’
- Advertisement -
- Advertisement -