- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. పాకిస్తాన్లోని డాష్ట్లో పారామిలటరీ సైనికుల కాన్వారుపైకి ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నిండిన కారు వారిపైకి దూసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సైనికులు, ఇద్దరు స్థానిక ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు ప్రకటించారు.
- Advertisement -