Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..13 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..13 మంది సైనికులు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. వాయువ్య పాకిస్థాన్‌లో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగినట్లగా అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం.. సైనిక కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా బాంబు పేలడంతో 13 మంది సైనికులు చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. అంతేకాకుండా సమీపంలోని 19 మంది పౌరులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad