– 27 మంది మృతి.. 52 మందికి గాయాలు : సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడి
డమాస్కస్: సిరియాలోని డమాస్కస్లోగల మార్ ఎలియాస్ క్రిస్టియన్ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది పౌరులు చనిపోయారు. 52 మంది గాయాల పాలయ్యారని సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రార్థనల కోసం చర్చికి వచ్చిన వారిలో 27 మంది మృతి చెందారు. డజన్ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనను సిరియా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. మృతులకు సిరియా అంతర్గత మంత్రి అనాస్ ఖత్తాబ్ సంతాపం వ్యక్తం చేశారు. ”ఇలాంటి ఉగ్రవాద చర్యలతో సిరియాలో అశాంతిని నెలకొల్పలేవు. సిరియా భద్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు ఐక్యంగా నిలబడతారు” అని ఆయన అన్నారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్టు ఆయన ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
డమాస్కస్లోని చర్చిలో ఆత్మాహుతి దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES