నవతెలంగాణ-హైదరాబాద్: 18ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025 ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ విక్టరీని సెలబ్రెట్ చేసుకోవాలని ఆ జట్టు యాజమాన్యం గొప్పగానే ప్లాన్ చేసింది. కర్నాటకలోని చిన్నస్టేడియంలో విక్టరీ పరేడ్ నిర్వహించి..టీంను సన్మానించాలని జట్టు యాజమాన్యంతో పాటు సిద్దరామయ్య ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఇంతలో విజయోత్సహ సంబరాలను చూసేందుకు తండోపతండాలు తరలించిన జనాలతో..చిన్నస్టేడియం ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి..11మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన యావత్తు దేశాన్ని కలువర పరిచింది. ఈక్రమంలో ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. సుమోటోగా కేసు స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపనుంది..
బెంగళూర్ తొక్కిసలాట ఘటనపై సుమోటోగా కేసు విచారణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES