నవతెలంగాణ-హైదరాబాద్ : చాలా పరస్పర చర్యలు డిజిటల్ ప్లాట్ఫారమ్లకు మారిన ఈ యుగంలో, సుందరం ఫైనాన్స్విశాఖపట్టణంలో ప్రత్యేకమైన కస్టమర్ మీట్ ‘సుందరం సర్కిల్’ను నిర్వహించడం ద్వారా మానవ అనుసంధానంపై తననిబద్ధతను మరలా రుజువు చేసింది. “Where Legacy Meets Loyalty — and Welcomes the Next Generation (వేర్ లెగసీమీట్స్ లాయల్టీ-అండ్ వెల్కమ్స్ ది నెక్స్ట్ జనరేషన్)” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, దీర్ఘకాల వాణిజ్య వాహనవినియోగదారులు మరియు వారి తరువాతి తరాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చింది. అనుసంధానం, ప్రతిబింబం, మరియుభవిష్యత్ దిశగా సంభాషణలతో నిండిన ఈ సాయంత్రం సమావేశంలో సుమారు 113 మంది కస్టమర్లు పాల్గొన్నారు.
ప్రపంచం వర్చువల్ సౌలభ్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, వ్యక్తిగత అనుబంధాల విలువను సుందరం ఫైనాన్స్ ఎల్లప్పుడూముందుంచుతుందని కంపెనీ నాయకత్వం స్పష్టం చేసింది. “సంబంధాలు తెరమీద ఏర్పడవు — అవి కరచాలనం, చిరునవ్వు,మరియు కలిసి గడిపిన సమయంతోనే బలపడతాయి” అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు.
ఈ నమ్మకం, మా వ్యవస్థాపకుడు శ్రీ T.S. సంతానం గారి మార్గదర్శక మంత్రాన్ని ప్రతిధ్వనిస్తుంది: “కాంటాక్ట్. కాంటాక్ట్. కాంటాక్ట్.” ఇది శాశ్వత కస్టమర్ సంబంధాల మూలస్తంభంగా నిలిచింది. కస్టమర్-సెంట్రిసిటీ ఒక ధోరణిగా మారకముందే, 1924లోనే మావ్యవస్థాపకుడి తండ్రి శ్రీ సుందరం అయ్యంగార్ గారు బస్సు రవాణా రంగంలో ఇటువంటి అనేక కార్యక్రమాలకు పునాదులు వేసిమార్గదర్శకత్వం వహించారు.
సుందరం ఫైనాన్స్, సుందరం హోమ్, సుందరం మ్యూచువల్, రాయల్ సుందరం, సుందరం బిజినెస్ సర్వీసెస్ మరియుసుందరం ఆల్టర్నేట్స్ వంటి గ్రూప్ కంపెనీల ద్వారా సమగ్ర పరిష్కారాలను అందించడం ద్వారా, ఈ మొత్తం ఈవెంట్ సుందరంఫైనాన్స్ యొక్క 360° నిబద్ధతను ప్రతిబింబించింది.
ఈ 360° విధానం కేవలం లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తరిస్తుంది. సుందరం ఫైనాన్స్ అనేది ప్రతిరోజూఅనుసంధానాలను నిర్మించే వ్యాపారం, ఇక్కడ భాగస్వామ్యాలు జీవనోపాధికి శక్తినిస్తాయి, వ్యాపారాలకు బలాన్ని ఇస్తాయి, కలలుసాకారం కావడానికి దోహదపడతాయి. దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావంపై దృష్టి సారించే గ్రీన్ టాస్క్ ఫోర్స్తో పాటు, ఆరోగ్యం,విద్య, సంస్కృతి మరియు సుస్థిరత రంగాల్లో సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా గ్రూప్ తన కర్తవ్యాన్ని పరిపూర్ణం చేస్తోంది.
కస్టమర్ మీట్లో సీనియర్ నాయకుల ప్రసంగాలు, తరువాతి తరం వ్యవస్థాపకులు మరియు వ్యాపార యజమానులతోస్ఫూర్తిదాయక సంభాషణలు, అలాగే అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంలో సుందరం ఫైనాన్స్ మరియు గ్రూప్పరిష్కారాల పాత్రపై చర్చలు జరిగాయి. కంపెనీతో తమ శాశ్వత అనుబంధాన్ని గౌరవిస్తూ, నాయకులు దీర్ఘకాల కస్టమర్లను ప్రత్యేకగుర్తింపు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంలో, అనుభవజ్ఞులైన వినియోగదారులు తమ ప్రయాణాలను పంచుకోగా,మొదటిసారి హాజరైనవారు సంస్థ యొక్క సంబంధ-ఆధారిత విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు—ఇది నేటి వేగవంతమైన,లావాదేవీ-కేంద్రీకృత మార్కెట్లో సుందరం ఫైనాన్స్ను ప్రత్యేకంగా నిలబెట్టే మూలస్థంభం.
సాయంత్రం ముగింపులో, సుందరం ఫైనాన్స్ తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా వ్యక్తం చేసింది—అది కేవలం తదుపరిలావాదేవీకి మాత్రమే కాక, ప్రతి కస్టమర్ ప్రయాణంలోని ప్రతి తదుపరి క్షణంలోనూ స్థిరమైన భాగస్వామిగా నిలవడమే లక్ష్యమనిపునరుద్ఘాటించింది.


