- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధారావత్ సునీత రవీందర్ నాయక్ నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆమె చూపుతున్న నిబద్ధత, సేవా దృక్పథాన్ని గుర్తించిన ఆదివారం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ల చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



