- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: క్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 231 పరుగుల భారీ స్కోరును నమోదు చేశారు. విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లు తేలిపోవడంతో హైదరాబాద్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
- Advertisement -