- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కేటీఆర్కు అనుకూలంగా వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. పిటిషన్పై సమాధానం చెప్పాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది.
- Advertisement -