Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంకేటీఆర్‌కు సుప్రీం నోటీసులు

కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు

- Advertisement -

– కాంగ్రెస్‌పై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పండి
న్యూఢిల్లీ:
కాంగ్రెస్‌ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధా నం చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ప్రభు త్వంపై కేటీఆర్‌ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసులిచ్చింది. కాంగ్రెస్‌ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కరోల్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్‌ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు ఆత్రం సుగుణ.. ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నేత ఫిర్యాదుతో కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని గతంలోనే కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారించింది. ఆ తర్వాత కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థా నంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టివేసి నా.. తాజాగా సుప్రీంకోర్టు నోటీసులతో ఇప్పుడీ కేసు మళ్లీ న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. భారత అత్యున్నత న్యాయస్థానం విచారణతో ఈ అంశం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -