- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి, సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు.హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఆయన జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
- Advertisement -