- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా మారారు. తమ సినిమాల అప్డేట్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. నటి సురేఖ వాణి కూడా తన సినిమాల విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తల్లీకూతుళ్లు సురేఖవాణి – సుప్రీత తాజాగా నడక దారిన మోకాళ్ళ పర్వతంపై మోకాళ్ల మీద మెట్లు ఎక్కి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్గా మారాయి.
- Advertisement -



