నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ ఫ్రెంచ్ ఫార్మాస్యూటికల్ సర్వియర్ గ్రూప్ అనుబంధ సంస్థ సర్వేయర్ ఇండియా అక్యూట్ మైలోయిడ్ లుకేమియా చోలాంగి యోకార్సినోమా ఉన్న క్యాన్సర్ రోగుల నిర్వహణలో నూతన థెరపీని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేస్-1 మ్యుటేషన్తో ఆమోదించబడిన ఓరల్ టార్గెటెడ్ థెరపీ అని తెలిపింది. దీనికి సంబంధించిన మందుల దిగుమతి, అమ్మకం, పంపిణీ కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఏడాది మే 14న సర్వేయర్ ఇండియా ఆమోదం పొందినట్టు తెలిపింది. ఈ సందర్భంగా సర్వేయర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరేలియన్ బ్రైటన్ మాట్లాడుతూ క్యాన్సర్ సంరక్షణలో అంతరాలను తొలగించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకుపోవడంలో ఉపయోగపడుతుందని మెడికల్ అండ్ పేషెంట్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రణవ్ సోపోరి ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్వేయర్ ఇండియా ఓరల్ క్యాన్సర్ థెరపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES