- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో శనివారం గ్రామానికి చెందిన పైడి చంద్రశేఖర్ ఇంట్లో ఉదయం ఎవరు లేని సమయంలో శబ్దం వచ్చాయి. దీంతో చుట్టుపక్కల వారు గమనించి, ఇంట్లో చూడగా అదే గ్రామానికి చెందిన లింగాపురం రాజకుమార్ కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గ్రామానికి చేరుకున్న పోలీసులు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
- Advertisement -



