Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కియర్ని భాగస్వామంతో స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్

కియర్ని భాగస్వామంతో స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: స్విగ్గీ, (స్విగ్గీ లిమిటెడ్, NSE: స్విగ్గీ / BSE: 544285), భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం, కియర్ని భాగస్వామ్యంతో తన వార్షిక నివేదిక “హౌ ఇండియా ఈట్స్” 2025 ఎడిషన్ ను నేడు విడుదల చేసింది. ఫ్లాగ్ షిప్ నివేదిక భారతదేశపు వినియోగదారులు యొక్క అభివృద్ధి చెందుతున్న ఆహారపు అలవాట్లకు ప్రతిబింబంగా ఉంది మరియ ఇది దాని రెండవ ఎడిషన్.

2030 నాటికి భారతదేశపు ఆహార సేవల మార్కెట్ US$ 125 బిలియన్ ను దాటుతుందని, సంఘటిత విభాగం అసంఘటిత విభాగం కంటే 2 x పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.

● వ్యవస్థీకృత విభాగం ఆహార సేవల్లో పూర్తి వృద్ధిలో 60% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటుంది మరియు అసంఘటిత విభాగాన్ని అధిగమిస్తుంది.

● చైనాలో 5% మరియు బ్రెజిల్ లో 6%తో పోల్చినప్పుడు ఆహార సేవలు భారతదేశంలో GDPకి 1.9% తోడ్పాటుతో అభివృద్ధి చెందడానికి భారీ స్థానం కల్పిస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ అవలంబన మరియు సౌకర్యం కోసం పెరుగుతున్న కోరిక ఈ అభివృద్ధి వెనక ఉన్న స్థూల గాథను కలిగి ఉన్నప్పటికీ, ఈ వృద్ధి ఆకారం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది:

● భారతదేశపు వినియోగదారుడు ఎక్కువగా ప్రయోగం చేస్తున్నాడు : ఒక్కొక్క కస్టమర్ నుండి ఆర్డర్ చేసే విలక్షణమైన వంటకాలలో 20% పెరుగుదల మరియు ఒక్కొక్క కస్టమర్ నుండి ఆర్డర్ చేసే రెస్టారెంట్లలో 30% పెరుగుదల.

● ఆనందం, ఆరోగ్యం రెండు అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ, అవి ఒకే సమయంలో ధోరణులుగా ఉన్నాయి.

○ డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు ~3x పెరుగుతున్నాయి, పిజ్జాస్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం రాత్రి 11 గంటల తరువాత అత్యధికంగా పెరుగుతోంది.

○ పూర్తి ఆర్డర్లలో ఆరోగ్యకరమైన మరియు బెటర్ ఫర్ యు మీల్స్ 2.3x పెరుగుతున్నాయి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, కాలరీలను గమనించడం, జోడించబడిన చక్కెరను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.

భారతదేశం ఆహార సేవల్లో అభివృద్ధికి రెండు ఉత్తేజకరమైన హద్దులను ఎలా చూస్తుందో కూడా ఈ నివేదిక తెలియచేసింది- భారతదేశం గొప్ప వంటల వారసత్వాన్ని పునః కనుగొనడం.

● గోవాన్, బీహారి, పహరి వంటి హైపర్-రీజనల్ ఆహారాలను భారతదేశం పునః కనుగొంటోంది, ఇవి ప్రధాన స్రవంతికి చెందిన వంటకాలలో 2-8x పెరుగుతున్నాయి.

● మజ్జిగ, షర్బత్ వంటి స్థానిక భారతదేశపు పానియాలు మొత్తం పానియాల్లో 4-6x పెరుగుతున్నాయి. భారతదేశం కోసం కొత్త ఆవిష్కరణలను చేయడం కోసం అంతర్జాతీయ QSRలను ప్రోత్సహిస్తోంది- స్టార్ బక్స్ లో కాలా ఖట్టా కోల్డ్ బ్రూ లేదా మెక్ డొనాల్డ్స్ లో చిల్లీ గువా డ్రింక్ గురించి ఆలోచించండి.

● మొత్తం పానియాల్లో టీ 3x కంటే ఎక్కువగా పెరుగుతోంది, తుదకు రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న స్టాల్ ను డిజిటల్ ఛానల్స్ సంచలనవార్తగా చూపిస్తున్నాయి

…ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ఆహార విభిన్నతను అనుసరిస్తూనే:

● 17x, 6x మరియు 3.7x వృద్ధి సూచికలతో కొరియన్, వియత్నమీస్ మరియు మెక్సికాన్ వంటకాలు ప్రధాన స్రవంతిగా మారుతున్నాయి. పెరువియన్ మరియు ఇథియోపియన్ ఆహారాలు కూడా రంగప్రవేశం చేశాయి.

● బొబా టీ, మాచా టీలు వరుసగా గత అయిదు సంవత్సరాల్లో సెర్చ్ పరిమాణాల్లో 11x మరియు 4x పెరుగుదలను చూసాయి.

● బాగా ప్రయాణించి మరియు సామాజిక మాధ్యమం విజ్ఞానం కలిగిన పట్టణ భారతదేశపు వినియోగదారు కోసం సూషీ, టాకోస్ మరియు కొరియన్ BBQలు ఎంత మాత్రం ప్రత్యేకమైనవి కావు మరియు అవి వారపు రాత్రుళ్లు ప్రధానమైన అవసరాలుగా మారుతున్నాయి.

స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ CEO రోహిత్ కపూర్ మాట్లాడుతూ“కేవలం ఒక దశాబ్దం సమయంలో, పరిశ్రమ అసమానమైన పరిమాణాన్ని చూసింది. వేగంపై అంచనాలు శీఘ్ర వర్తకంచే తీర్చిదిద్దబడ్డాయి. ఉదాహరణకు, మా 10- నిముషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ Bolt ప్లాట్ ఫాం ఆర్డర్లలో 10%కంటే అధికంగా తోడ్పడుతోంది. ఒక వైపు, వినియోగదారులు ఇండియన్ మరియు ఇటాలియన్ వంటి ప్రసిద్ధి చెందిన వంటకాల్లో సరసమైన ధరలను డిమాండ్ చేస్తూనే, మరొక వైపు, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బోబా, మాచా టీ వంటివి స్వీకరిస్తున్నారు. మరియు మా రెస్టారెంట్ భాగస్వామ్యులు QSR మరియు క్లౌడ్ కిచెన్ ల వేగానికి అనుగుణంగా కొనసాగిస్తున్నారు, ఇవి 17%+ CAGR వద్ద పెరుగుతాయని అంచనా వేయబడింది, ఇది సంఘటిత ఆహార సేవల అభివృద్ధిలో సుమారు 1.5 xగా ఉంది. ఈ చురుకుగా మారుతున్న రంగంలో భాగస్వామ్యులు అందరి కోసం రాబోయే దశాబ్దం భద్రపరిచిన అంశం గురించి తెలుసుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను.” అన్నారు.

F&B లీడ్, కియర్నిలో QSR ఆసియా లీడ్ రజత్ తులి మాట్లాడుతూ “భారతదేశపు ఆహార ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా విస్తరించడాన్ని మేము చూస్తున్నాము. వృద్ధి కొన్ని మెట్రోలలో మాత్రమే కేంద్రీకృతమవలేదు. అగ్ర స్థానంలోని 8 నగరాల కంటే బయట భోజనం (డైనింగ్-అవుట్) వృద్ధి టాప్ 8 నగరాల కంటే 2x ఎక్కువగా ఉంది. కార్పొరేట్, పారిశ్రామిక, విద్య, పర్యాటక కేంద్రాలు ఈ విషయంలో ముందున్నాయి. GenZ ఎక్కువ ఆశావాద దృక్పధాన్ని అందిస్తోంది, డైనింగ్-అవుట్ విభాగంలో 3 x ఇతర సమూహాలను పెంచుతుంది. అదే సమయంలో కాఫీ రేవ్స్ మరియు ఇన్ స్టాగ్రామ్- విలువైన ప్రదేశాలు, మెనూలను వంటి ఆవిష్కరణలను కూడా డిమాండ్ చేస్తుంది. ఈ కొత్త మార్కెట్లు, వినియోగదారులను అర్థం చేసుకున్న భాగస్వాముల నుండి ఆహార సేవల్లో తదుపరి నాయకత్వం ఒరవడి వస్తుంది. ఇంకా, ఆహారాల డెలివరీలో ప్యాకేజింగ్ లో డైనింగ్-అవుట్ లో ఫార్మాట్ కు బదులుగా ప్యాకేజింగ్ ఆవిష్కరణలు వస్తాయి” అన్నారు.

ఈ ధోరణులను ప్రభావవంతంగా పరిష్కరించడానికి, ఆహార సేవల భాగస్వామ్యులు బహుళ ప్రాధాన్యతలను సమతుల్యత చేయవలసిన అవసరముంది. వేగం, సరసమైన ధరలు, అనుభవంపై దృష్టి కేంద్రీకరించి అందించాలి :

● రెస్టారెంట్లు డిజిటల్ ఛానళ్లపై ముఖ్యంగా యువ వినియోగదారులను ఆకర్షించడానికి తమ మార్కెటింగ్ బడ్జెట్లలో 75%+ ఖర్చు చేస్తున్నారు

● డైనింగ్-అవుట్ లో వాక్ ఇన్ ఆర్డర్లలో ప్రీ-బుక్కింగ్ 7x పెరుగుతోంది

● ఉత్తర భారతదేశం, ఇటాలియన్ వంటి ప్రసిద్ధి చెందిన వంటకాలు తక్కువ ధరల పాయింట్లలో పెరుగుదలపై 10-40% ఎక్కువ సూచికను పొందుతున్నాయి.

● ఇ-కామర్స్ అన్ బాక్సింగ్ అనుభవం ఆహార డెలివరీలో కూడా అనుకరించబడుతోంది: బట్టర్ ఫ్లై బర్గర్ బాక్స్ లు ప్లేట్స్ గా విడదీయబడటం, మరియు నెమ్మదిగా వండిన దమ్ బిర్యానీ మీ కోసం మట్టి హండీలలో తీసుకురావడం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -