నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్కప్ 2026 జరగనుంది. దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి పాట్ కమిన్స్ దూరమయ్యాడు. మిచ్మార్ష్ ఆసీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 11న తన తొలిమ్యాచ్ను ఐర్లాండ్తో ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు: మిచ్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కెమెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమెన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
T20 World Cup: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
- Advertisement -
- Advertisement -



