Tuesday, February 24, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: టాస్ గెలిచిన పాక్

T20 WORLD CUP: టాస్ గెలిచిన పాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శ్రీలంకలోని పల్లెకెలెలో మ‌రో సూపర్-8 పోరుకు పాక్ టీం సిద్ధ‌మైంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈక్ర‌మంలో టాస్ గెలిచిన ఆఘా సేన బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కు అర్హత సాధించే పరిస్థితి. పల్లెకెలెలో ఇంగ్లాండ్ జట్టుకు ఈ మైదానంలో మంచి అనుభవం ఉంది. నెమ్మదిగా ఉండే పిచ్‌ను ఉపయోగించుకుని పాకిస్థాన్ స్పిన్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌కు సవాల్ విసరాలని చూస్తోంది. ఇది పాకిస్థాన్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -