- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ తుదిపోరులో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ సంజు 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశారు. అంతకముందు అభిషేక్ శర్మ కూడా కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశారు. రచిన్ వేసిన ఏడో ఓవర్లో అభిషేక్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ అదే జోరును కొనసాగించాడు. 14 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వికెట్ కోల్పోయిన రన్ రేట్ తగ్గకుండా ప్రతి ఓవర్లో ఫోర్లు, సిక్సులతో మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేరికి ఇండియా స్కోర్: 170-1 క్రీజులో సంజు(69), ఇషాన్(42) ఉన్నారు.
- Advertisement -



