Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

- Advertisement -

– కలెక్టర్లకు సీఎస్‌ రామకృష్ణారావు దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వన మహౌత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్‌ పామ్‌ విస్తరణ, భూ భారతి, సీజనల్‌ వ్యాధులు, టీబీ ముక్త్‌ భారత్‌, వైద్య కళాశాలల అవసరాలు మొదలైన అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ సమీక్షించారు. ప్రజల జీవితాల్లో శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిం చాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వనమహౌత్సవ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. వనమహౌత్సవంలో నాణ్యత గల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయా లను నిర్ధారించుకోవాలని సూచించారు.
ఈ సారి పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సులో 8లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయనీ, దరఖాస్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షిం చి, మానవీయ కోణంలో వాటిని పరిష్కరించడాని కి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాపించే వ్యాధులపై కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ కోరారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌పై, జిల్లా కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశిం చారు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు, రెడ్‌ క్రాస్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్లతో కూడిన కన్వర్జెన్స్‌ సమావేశాన్ని నిర్వహించాలని వారికి సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపోయే ఎరువులు అందుబాటులో ఉన్నాయనీ, వాటిని సక్రమంగా పంపిణీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్‌ రావు ఈ సందర్భంగా వారికి సూచించారు. ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి జిల్లాల్లో పెద్ద ప్రాంతాలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, ఆరోగ్య కుటు ంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జె చోంగ్తు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -