- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఉపాధ్యాయుల వేసవి శిక్షణా శిబిరం కార్యక్రమాన్నీ మంగళవారం ఎంఈఓ లక్ష్మన్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు ఈ వేసవి శిక్షణా శిబిరంతో మెరుగైన విద్యను అందించడానికి,విద్యార్థుల భవిష్యత్ ను మెరుగుపరచుకోవడానికి పలు అంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ శిబిరానికి మొదటిరోజు 100శాతం హాజరైనట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్జిటి,ఎల్ఎస్ఏల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -