- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో కంప్యూటర్లో ఏర్పడే సాంకేతిక సమస్యలతో రోగులు ఇబ్బందీ పాలవుతున్నారు. సకాలంలో కంప్యూటర్ ఓపి రిజిస్ట్రేషన్లు, రివిసిట్లు పనిచేయక ఛాల మంది రోగులు ఎమర్జెన్సీ భాదితులు తీవ్ర అస్వస్థతకు గురి అయిన బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యలను అధికారులు సకాలంలో స్పందించి సమస్యలు తీర్చాలని కోరారు. బుధవారం భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన మేకల బాలు ఆస్పత్రికి వెళ్లగా, తనతోపాటు చాలామంది ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.
- Advertisement -