– సీపీఐ(ఎం), సీపీఐ నాయకుల సంతాపం
– రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
నవతెలంగాణ-మియాపూర్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ మహిళా సమాఖ్య నాయకురాలు శాఖమూరి సుగుణ(91) సోమవారం అర్ధరాత్రి 11 గంటలకు హైదరాబాద్, కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే మంగళవారం ఉదయం సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్య క్షులు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్. కె.నారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావుతో పాటు సీపీఐ(ఎం) నాయకులు ఆమె భౌతిక కాయంపై పార్టీజెండా ఉంచి, పుష్పాంజలి ఘటించా రు. సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు, ఫౌండేషన్ ట్రెజరర్ వి.చెన్నకేశవరావు, సీఆర్ పాలీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ రజిని, మహిళా సంక్షేమ కేంద్ర డైరెక్టర్ జోస్యబట్ల కల్పన, మహిళా సమాఖ్య నాయకులు ప్రేం పావని, డాక్టర్ నారాయణరావు, వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తానియా, డాక్టర్ మండవ గోపీచంద్, డాక్టర్ పి.సరస్వతి, ఎక్లైన్ ఎడ్యుకేషనల్ సంస్థ ప్రతినిధి ఏకే జిలానీ, మేనేజర్ శ్రీనివాస్, వృద్ధాశ్రమ వాసులు, సిబ్బంది, తదితరులు సుగుణమ్మ మృతదేహానికి నివాళి అర్పించారు. సుగుణమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డాక్టర్ శాఖమూరి శోభ (కుమార్తె), డాక్టర్ శాఖమూరి రవి, శాఖమూరి రమేష్ (కుమారులు) అమెరికా నుంచి బయలుదేరారు. బుధవారం రాత్రికి వారు హైదరాబాద్ చేరుకోనున్నారు. సుగుణమ్మ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం 19వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 11గంటల వరకు హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మియాపూర్లోని స్వగృహం వద్ద ఉంచుతారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES