– వైద్య పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు
– సీఎం సూచనతో మిస్వరల్డ్ అభ్యర్థులకు అవగాహన
– హెల్త్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత, సామర్థ్యం కలిగిన వైద్యులు, నాణ్యత గల చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తుండగా, మిస్వరల్డ్ పోటీలతో ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మార్గదర్శకాల మేరకు 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే, 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్లో మెడికల్ టూరిజంను ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
16న అవగాహన
సీఎం రేవంత్రెడ్డి సూచనతో తెలంగాణలో తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను, మెడికల్ టూరిజం లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని తెలియజేసేలా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఈ నెల 16న అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ను ప్రత్యేకంగా అధికారులు నిర్వహిస్తున్నారు.
ఖర్చు తక్కువ…. ప్రభావవంతమైన చికిత్సలు
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60 నుంచి 80 శాతం తక్కువ. దాదాపు శతాబ్ద కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి, నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, అపోలో కాంటినెంటల్ హాస్పిటల్స్ వంటి ప్రయివేట్ ఆస్పత్రులు అత్యాధునిక సాంకేతికత (రోబోటిక్ సర్జరీ, టెలిమెడిసిన్), మల్టీస్పెషాలిటీ కేంద్రాలతో…. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, క్యాన్సర్ చికిత్స, ట్రాన్స్ప్లాంటేషన్, కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీ, ఫెర్టిలిటీ చికిత్సలు, అవయవ మార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియలకు నిపుణులైన వైద్యులతో సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నారు.
ఇక, మెడికల్ చార్జీల విషయానికొస్తే అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో హార్ట్ సర్జరీ, బై పాస్ సర్జరీ ఒక లక్ష డాలర్లు అవుతుండగా హైదరాబాద్లో మాత్రం కేవలం 5 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్లు మాత్రమే ఖర్చవుతున్నాయి. అదేవిధంగా, మోకాలు నీ రీప్లేస్ మెంట్ సర్జరీకి వెస్ట్రన్ దేశాల్లో 40 వేల నుంచి 60 వేల డాలర్లు అవుతుండగా, హైదరాబాద్లో మాత్రం ఐదు వేల డాలర్ల లోపే అవుతున్నాయి. డెంటల్ సమస్యలకు విదేశాలలో ఐదు వేల డాలర్లు అవుతుండగా మన దగ్గర వెయ్యి డాలర్ల లోపే అవుతున్నాయి. అందుకే, విదేశాల నుంచి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో రోగులు హైదరాబాద్ వస్తున్నారు
హెల్త్ టూరిస్ట్లను ఆకర్షిస్తున్న అంశాలివే
తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సలు, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, నిపుణులు, కనీస నిరీక్షణ సమయాలు, ఇంగ్లీష్ మాట్లాడే సిబ్బంది , కమ్యూనికేషన్ సౌలభ్యం, ప్రభుత్వ మద్దతు, వైద్య వీసా (ఇ-వీసా), స్నేహపూర్వక వాతావరణం, కనెక్టివిటీ, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఫలితంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం నుంచి రోగులు ఎక్కువగా హైదరాబాద్కు వస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో మెడికల్ టూరిజం శరవేగంగా అభివద్ధి చెందుతున్నది.
పెరుగుతున్న హెల్త్ టూరిస్టులు
2014 సంవత్సరంలో 75,171 మంది విదేశీ హెల్త్ టూరిస్టులు వైద్య సేవలు పొందేందుకు హైదరాబాద్కి రాగా… 2024 సంవత్సరం వరకూ దశాబ్ద కాలంలో లక్షా 55 వేలా 313 మంది విదేశీయులు వచ్చారు. అదే సమయంలో 2024 సంవత్సరంలో 8 కోట్లా 82 లక్షలా 39 వేల 675 మంది రోగులు దేశంలోనీ వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చారు. ఇప్పటికే మెడికల్ టూరిజంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండగా, మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో మెడికల్ టూరిజంలో తెలంగాణ ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కషి చేస్తున్నది.
గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES