Wednesday, June 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ కు వెళ్లారు. అనంతరం అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం నేరుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతోన్న పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ప్రత్యేక అతిథులుగా జపాన్ బృందం హాజరైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -