- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలో పెండింగ్ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్బీ శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -

 
                                    