Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో తెలంగాణ ఫస్ట్‌

పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో తెలంగాణ ఫస్ట్‌

- Advertisement -

– నేడు అవార్డు స్వీకరించనున్న ఇంటెలిజెన్స్‌ డీజీ
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానాన్ని సాధించినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎస్‌.జైశంకర్‌ నుంచి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివధర్‌రెడ్డి అవార్డును మంగళవారం అందుకోనున్నారు. దేశంలోనే మొదటిసారిగా పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌కు సంబంధించి వెరీ స్పీడ్‌ యాప్‌ను రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. పాస్‌పోర్ట్‌లు వెరిఫికేషన్‌ జరిపే యాప్‌ విభాగంలోని అధికారులు, సిబ్బంది దీని ద్వారా కేవలం మూడ్రోజుల్లోనే అభ్యర్థుల పాస్‌పోర్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి పంపించటం జరుగుతున్నది. ఈ సందర్భంగా వెరిఫికేషన్‌ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు అభ్యర్థికి మెసేజ్‌ల ద్వారా సంబంధిత విభాగం అధికారులు పంపించటమేగాక వారికి ఏవేనీ సందేహాలుంటే వెంటనే తీర్చటం జరుగుతున్నది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యాప్‌ కారణంగా పాస్‌పోర్ట్‌ల విచారణ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతున్నదని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -