Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంనీట్‌ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల సత్తా

నీట్‌ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల సత్తా

- Advertisement -

– రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్‌కు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌
– ఉత్కర్ష్‌ (మధ్యప్రదేశ్‌)కు రెండో ర్యాంక్‌, కృషంగ్‌ జోషి( మహారాష్ట్ర)కు మూడో ర్యాంక్‌
– తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్‌ సాయి కుమార్‌కు 18వ ర్యాంకు
– ఏపీకి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌కు 19వ ర్యాంకు
న్యూఢిల్లీ:
నీట్‌ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటా రు. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ ఫలితాలు శుక్రవారం విడుదల య్యాయి. దేశవ్యాప్తంగా 22 లక్షలా 9 వేలా 318 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12 లక్షలా 36 వేలా 531 మంది అర్హత సాధించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్‌ రెండో ర్యాంక్‌, మహారాష్ట్రకు చెందిన కృషంగ్‌ జోషి మూడో ర్యాంక్‌ సాధించి తమ సత్తా చాటారు. మహిళల విభాగంలో ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్‌కు తొలి ర్యాంకు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 41 వేలా 584 మంది విద్యార్థులు, ఏపీ నుంచి 36వేలా 776 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్‌ సాయి కుమార్‌కు 18వ ర్యాంకు సాధించాడు. ఏపీకి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌కు 19వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన షణ్ముఖ్‌ నిషాంత్‌కు 37, మంగారి వరుణ్‌కు 46, యండ్రపాటి షణ్ముక్‌కు 48వ ర్యాంకు వచ్చింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌కు 56వ ర్యాంకు, దేసిన సూర్యచరణ్‌కు 59, పొదిలపు అవినాశ్‌కు 64వ ర్యాంకు, యర్రా సమీర్‌కుమార్‌కు 70వ ర్యాంకు వచ్చింది. తుమ్మూరి శివ మణిదీప్‌కు 92వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన బిదీష మాఝి 95వ ర్యాంక్‌ సాధించింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. అలాగే వారి ఈ-మెయిల్‌కు స్కోర్‌కార్డులు పంపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -