Thursday, June 19, 2025
E-PAPER
Homeసినిమాచివరి షెడ్యూల్‌లో 'తెలుసు కదా'

చివరి షెడ్యూల్‌లో ‘తెలుసు కదా’

- Advertisement -

హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్‌ డ్రామా ‘తెలుసు కదా’. ఈ మూవీతో స్టైలిస్ట్‌ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వ ప్రసాద్‌, టిజి కతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ మూవీ చివరి షెడ్యూల్‌ బుధవారం ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ షెడ్యూల్‌ జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే డబ్బింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ సినిమా మొదటి పాటను విడుదల చేసి మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించాలని టీం ప్లాన్‌ చేస్తోంది. మనసుని హత్తుకునే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇది లవ్‌, పర్సనల్‌ గ్రోత్‌, రిలేషన్షిప్స్‌ మధ్య సాగుతుంది. అద్భుతమైన ఎమోషన్‌, హ్యుమర్‌తో ప్రేక్షకులని అలరించబోతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: నీరజ కోన, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్‌, టీజీ కతి ప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌, డీవోపీ: జ్ఞాన శేఖర్‌ బాబా, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -