- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పై ప్రస్తుతం నిర్వహిస్తున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది. రంజాన్ పండుగ, సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్ లాంటి దేశాల మధ్య వర్తిత్వం కారణంగా తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ముఖ్యంగా రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
- Advertisement -


