- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అర్జున అవార్డు గ్రహీత, టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ను క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి, జాయినింగ్ రిపోర్టును అందించారు. ఏషియన్ గేమ్స్ సహా అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన సాకేత్కు ప్రభుత్వం చేయూతనిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
- Advertisement -



