- Advertisement -
నవతెలంగాణ హన్మకొండ: హన్మకొండలోని రామ్నగర్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.
- Advertisement -