Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీలో ఉద్రిక్త‌త‌..పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

ఢిల్లీలో ఉద్రిక్త‌త‌..పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని ఉభయ సభల్లోని ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. దీంతో నేడు లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2కి వాయిదా పడ్డాయి. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. ఎంతో కీలకమైన ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో, ఓటర్ల లిస్టుల్లో మోసాలకు వ్యతిరేకంగా సోమవారం ఇడియా బ్లాక్‌లోని పార్టీల ఎంపీలు మార్చ్‌ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ భవనం నుంచి.. ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకూ ఈ మార్చ్‌ జరుగుతంది.

అనుమతి లేకపోవడంతో ఎంపీలను మధ్యలో పోలీసులు నిలిపివేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా ఇండియా బ్లాక్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img