Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగాజులరామారంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన జనం

గాజులరామారంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన జనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారు గాజులరామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీ, బాలయ్య నగర్, గాలిపోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులకు ఆందోళనకు దిగారు. హబీబ్ బస్తీలో మరింత రెచ్చిపోయిన స్థానికులు కూల్చివేతలు జరుపుతున్న అధికారులు, జేసీబీలపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో హైడ్రా జేసీబీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొందరు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు.  రాళ్ల దాడి చేసిన వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు, అధికారులతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ పరిణామంతో గాజులరామారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు స్థానికులు తమ ఇండ్లు కూలగొట్టదని అధికారులను వేడుకుంటున్నారు. ఇవాళ బతుకమ్మ పండగ కాదు మా శవాల పండగ అని.. పండగరోజు పండగ లేకుండా చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -